ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జనగామ, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ విప్లు అయిలయ్య, రామచంద్రునాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేడుకలకు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాలు ఎగురవేసి, అమర వీరుల స్తూపాలకు నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఎగురవేయగా, ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాల్లో అధికారులు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుకు చేసుకున్నారు. – వెలుగు, నెట్వర్క్
