
కోల్బెల్ట్, వెలుగు: పెరియార్ రామస్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బలహీనవర్గాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్మోతె రాజలింగు అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం గాంధీనగర్లోని టీబీఎస్ఎస్ ఆఫీస్లో పెరియార్146వ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
బ్రిటిష్ పాలకులను ఎదిరిస్తూనే బలహీన వర్గాల ప్రజల విముక్తి, మహిళల స్వాభిమానం కోసం పెరియార్కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లీడర్లు గంధం బాబురావు, వెల్పుల మల్లేశ్, లింగంపల్లి శ్రీనివాస్, కాంపెల్లి శ్రీకాంత్తదితరులు పాల్గొన్నారు.