
బ్యాంకాక్: థాయ్లాండ్ తదుపరి ప్రధానిగా భుమ్జైతై పార్టీ నేత అనుతిన్ చార్న్విరాకుల్ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్లో ప్రతినిధుల సభలో మొత్తం 311 ఓట్లు సాధించి ప్రత్యర్థి చైకాసెమ్ నిటిసిరిని ఓడించారు. కాంబోడియా మాజీ అధ్యక్షుడు హన్సేన్తో ఫోన్ కాల్ సందర్భంగా థాయ్ మాజీ ప్రధాని షినవత్ర ఆయనను అంకుల్ అని సంబోధించడం వివాదాస్పదంగా మారింది.
థాయ్ సైనిక ఉన్నతాధికారి తనకు ప్రత్యర్థిగా మారారంటూ పలు కాన్ఫిడెన్షియల్ విషయాలనూ హన్ సేన్తో పంచుకున్నారు. ఈ ఫోన్ కాల్ లీక్ కావడంతో షినవత్రాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో పొరుగుదేశం నేతతో కీలక విషయాలు పంచుకున్న తీరు వివాదాస్పదమైంది.
దానిపై విచారణ జరిపిన ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం షినవత్ర తీరు నైతిక ప్రమాణాలను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని పేర్కొంటూ ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.