అది అబద్దం.. దుష్ప్రచారం చేస్తున్నవారిని వదిలపెట్టను

అది అబద్దం.. దుష్ప్రచారం చేస్తున్నవారిని వదిలపెట్టను
  • తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ 

వరంగల్ అర్బన్: కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసినట్టు తనపై ఓ మీడియాలో వచ్చినట్టు ప్రచారం జరుగుతుండటంతో స్పందించిన తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్. ఓటమి భయంతో కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.తప్పుడు ప్రచారం చేసిన వారెవరైనా..  ఎవరినీ వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు. నేను రాత్రి వరంగల్ నే బస చేశా... కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి.. పాత వీడియోలు, ఫోటోలతో పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి.. గందరగోళం సృస్టించడానికి ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు దిగుతుండడం దారుణమని ఆయన విమర్శించారు. ఓటర్లు విచక్షణతో ఆలోచించి ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.