ఆ మాఫియా నన్ను, కంగనాను టార్గెట్ చేసింది.. వివేక్ అగ్నిహోత్రి

 ఆ మాఫియా నన్ను, కంగనాను టార్గెట్ చేసింది.. వివేక్ అగ్నిహోత్రి

కశ్మీర్​ ఫైల్స్’​ సినిమాతో సెన్సేషనల్​ డైరెక్టర్​ గా మారిపోయాడు వివేక్​ అగ్నిహోత్రి. తాజాగా అతడు బాలీవుడ్​పై చేసిన వ్యాఖ్యలు వైరల్​ అవుతున్నాయి. తనను బాలీవుడ్ పూర్తిగా దూరం పెట్టిందన్నాడు. తన సినిమాలకు మధ్య తరగతి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉందని వివరించాడు. కరణ్​ జోహార్​ సినిమాల్లో లాగా వాస్తవానికి దూరంగా తన సినిమాలు, అలాంటి సినిమాల వల్లే ప్రేక్షకులు కనెక్ట్​ కాలేకపోతున్నారని, అందుకే బాలీవుడ్​ సినిమాలను  బాయ్​ కాట్​ చేయాలని కోరుతున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్​ మాఫియా ఇప్పుడు తనతో పాటు కంగనా రనౌత్​ను కూడా టార్గెట్​ చేసిందన్నాడు. ఎందుకంటే మేమిద్దరం తప్పులను ధైర్యంగా ప్రశ్నిస్తాం కాబట్టే. అందుకే.. తమను ఈ పరిశ్రమ దూరం పెట్టిందంటూ సంచలన కామెంట్స్​చేశాడు. మరి.. వివేక్​ అగ్నిహోత్రి చేసిన ఈ కామెంట్స్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా స్పందింస్తుందో చూడాలి.