గోదావరిఖని, వెలుగు : రామగుండం మెడికల్ కాలేజీలో మూడు రోజుల కింద ఫస్ట్ఇయర్ స్టూడెంట్లను ర్యాంగింగ్ చేసిన నలుగురు సెకండియర్ స్టూడెంట్లపై యాంటీ ర్యాగింగ్కమిటీ గురువారం చర్య లు తీసుకున్నది. ర్యాగింగ్చేసిన నలుగురి పేరెంట్స్ను పిలిపించి విచారణ జరిపింది. ర్యాగింగ్ చేసింది నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్ తెలిపారు. ఒకరిని ఆరు నెలల పాటు, మరో ఇద్దరిని నాలుగు నెలలు కాలేజీ నుంచి, మరో స్టూడెంట్ను హాస్టల్ నుంచి ఆరు నెలలు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత సోమవారం రాత్రి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ల గదిలోకి వెళ్లిన సెకండియర్ స్టూడెంట్స్ ట్రిమ్మర్తో జుట్టు కత్తిరించారు. ఐదుగురు బాధితులుండగా ఒకరు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా విచారణ జరిపారు. గురువారం రామగుండం సీపీ ఎం.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాగింగ్కు పాల్పడవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని స్టూడెంట్లతో ప్రతిజ్ఞ చేయించారు.