సెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం..

సెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం..

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5 వేల 89 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు (SA), (SGT), భాషా పండితులు (Pandit), వ్యాయామ ఉపాధ్యాయ (PET) ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 20న ముగియనుంది. 

పరీక్షను నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 5089

స్కూల్‌ అసిస్టెంట్‌ 1739
లాంగ్వేజ్ పండిట్‌ 611
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 164
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2575

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 20
ఆన్‌లైన్‌ రాత పరీక్ష: నవంబర్‌ 20 నుంచి 30 వరకు
వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in