- అహ్మదాబాద్లో 29న ఫైనల్
- ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్
- పుణెలో విమెన్స్ టీ20 చాలెంజ్ మ్యాచ్లు
ముంబై : ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ఖరారు చేసింది. అహ్మదాబాద్, కోల్కతాలను వేదికలుగా ఎంపిక చేసింది. క్వాలిఫయర్1, ఎలిమినేటర్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. క్వాలిఫయర్2, ఫైనల్ను అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి కేటాయించారు. ఈనెల 24, 25వ తేదీల్లో ఈడెన్లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్లో ఈనెల 27న క్వాలిఫయర్2తో పాటు 29న ఫైనల్ నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా మంగళవారం ప్రకటించారు. ఇక, మూడు జట్లు పోటీ పడే విమెన్స్ టీ20 చాలెంజ్కు పుణె ఆతిథ్యం ఇస్తుందని తెలిపారు. ఈ నెల 23, 24, 26 తేదీల్లో లీగ్ మ్యాచ్లు, 28న ఫైనల్ జరుగుతుందని జై షా వెల్లడించారు.