టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడ్డ పంత్ ని ముంబైలోని అంబానీ హాస్పిటల్ లో చేర్చారు. ప్రమాదంలో మోకాలికి గాయం అవగా, దాన్నుంచి కోలుకోవడానికి పంత్ కి ఎనిమిది నుంచి పది నెలల సమయం పట్టొచ్చని డాక్టర్స్ చేప్తున్నారు. దీంతో ఈ ఏడాది జరిగే ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్ లకు పంత్ దూరం అవొచ్చని బీసీసీఐ తెలిపింది.
గాయం నుంచి కోలుకున్నా... పంత్ ఫిట్ నెస్ సాధించి, ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టొచ్చు. దీంతో ఈ ఏడాదంతా పంత్ ఆటకు దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ల్లో కీలకం అయ్యే పంత్, ఆటకు దూరం అవడం భారత జట్టుకి తీరని ఎదురుదెబ్బ.