అచ్చంపేట, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో కుటుంబ కలహాలతో సొంత బావను బామ్మర్దులే కొట్టి చంపారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన పంబ మలయ్య(40), అదే గ్రామానికి చెందిన పుష్పను కొన్నేండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇటీవల తరచూ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బావమరిది గణేశ్, వరుసకు బామ్మర్దులు అయ్యే గట్టు తుమ్మెన్ గ్రామానికి చెందిన శంకర్, పోతిరెడ్డిపల్లికి చెందిన కురుమయ్య.. మల్లయ్యను మందు తాగుదామని గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఫుల్లుగా తాగాక అంతా కలిసి మల్లయ్యను చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు వారి నుంచి తప్పించుకుని ఊర్లోకి వెళ్లాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే మల్లయ్యను అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. సీరియస్అవ్వడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మల్లయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఫుల్లుగా తాగాక బావను కొట్టి చంపిన బామ్మర్దులు
- తెలంగాణం
- September 21, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి