ఓల్డ్సిటీ, వెలుగు: మాంజా అడిగితే ఇవ్వలేదని ఓ యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచాడు. ఐఎస్సదన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈదిబజార్కు చెందిన మహమ్మద్జియా రెహాన్గురువారం మధ్యాహ్నం తన అమ్మమ్మ ఇంటిపై గాలిపటం ఎగురవేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జైద్ అలీఖాన్ మాంజా ఇవ్వాలని అడిగాడు. ఇవ్వకపోవడంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తెచ్చి, జియా రెహాన్చాతిపై పొడిచాడు. అతనికి తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.
