విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలం

విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలం

రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కేవలం  ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని....కేంద్రం మధ్య వర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య మరింత తీవ్రమైందన్నారు. పోడు భూముల దరఖాస్తులు పెండింగులో ఉండగానే....రైతులపై దాడులు జరుగుతున్నాయన్నారు చాడ. బీజేపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు.