లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ : ఈసీ

 లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ : ఈసీ

లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ గురువారం (డిసెంబర్ 7న) తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం డిసెంబర్ 20 నుంచి జనవరి 5వ తేదీ వరకు కేంద్రం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 

2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. 2024 జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది.