జీఎస్టీ రాకతో కుటుంబ నెలవారీ ఖర్చులు తగ్గాయ్
ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) అమలు దేశంలో కన్జంప్షన్ పెరగడానికి ఇంజిన్గా ఉపయోగపడిందని ప్రభుత్వం వెల్లడించింది. కుటుంబాల నెలవారీ ఖర్చులు తగ్గడానికి జీఎస్టీ వీలు కల్పించిందని పేర్కొంది. ఆరేళ్ల కిందట జీఎస్టీని దేశంలో అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలులోకి రావడానికి ముందు వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పోల్చి మరీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పెట్టుబడులు పెరగడంతో సహా ప్రోగ్రెస్కి కేటలిస్ట్గా జీఎస్టీ మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
జీఎస్టీ రావడానికి ముందు పన్ను చట్టాలలో సంక్లిష్టత ఉండేదని, ఆ రూల్స్ను పాటించడం కష్టతరంగానూ ఉండేదని, పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ అమలు ఎంతో వెసులుబాటు కల్పించిందని స్పష్టం చేసింది. ఏప్రిల్1, 2018 నాడు దేశంలో 1.30 కోట్ల రిజిస్టర్డ్ టాక్స్పేయర్లుంటే, ఏప్రిల్1, 2023 నాటికి ఈ సంఖ్య 1.36 కోట్లకు పెరిగినట్లు ఫైనాన్స్మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆఫీసు ట్వీట్ చేసింది. ఎక్సైజ్డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి 17 లోకల్ ట్యాక్స్లను, 13 సెస్లను కలిపేసి ఒకే పన్ను (జీఎస్టీ) ని జులై 1, 2017న అమలులోకి తెచ్చారు.
నాలుగు శ్లాబ్స్తో ఈ జీఎస్టీ అమలవుతోంది. 5, 12,18,28 శాతం చొప్పున ఆయా వస్తువులు, సేవలపై జీఎస్టీని విధిస్తున్నారు. గోల్డ్, జ్యుయెలరీపై 3 శాతం, కట్–పాలిష్డ్ డైమండ్స్పై 1.5 శాతం చొప్పున స్పెషల్ రేటుతో పన్ను విధింపు అమలవుతోంది. లగ్జరీ, సిన్, డీమెరిట్ గూడ్స్పై అత్యధికంగా 28 శాతం జీఎస్టీతో పాటు, సెస్ను కూడా వసూలు చేస్తున్నారు. జీఎస్టీకి ముందు వ్యాట్, ఎక్సైజ్, సీఎస్టీ, ఇతర పన్నుల వల్ల కేస్కేడింగ్ ఎఫెక్ట్ పడేదని, కన్జూమర్పై పన్ను భారం సగటున 31 శాతంగా ఉండేదని ఈ ట్వీట్లో ప్రభుత్వం వివరించింది.