- గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రం
- ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ
పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బిల్డింగ్లో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్)ను ఆదివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఐవీఎఫ్ సెంటర్ పేదలకు వరం లాంటిదని అన్నారు. కార్పొరేట్ఆస్పత్రుల్లో లక్షల విలువ చేసే సంతాన సాఫల్య వైద్యం గాంధీ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు.
రూ.5 కోట్లతో ఈ సెంటర్ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న దంపతులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. మాతా శిశు సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని హోంమంత్రి అన్నారు. సంతానం కోసం పేద, మధ్య తరగతి ప్రజలు లక్షలాది రూపాయలు అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి గాంధీ ఐవీఎఫ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని టీఎస్ఎమ్ఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారాం, ఇన్చార్జ్ డీఎంఈ వాణిదేవి, సీఎం ఓఎస్డీ గంగా ధర్, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్వోడీలు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
రెగ్యులరైజ్ చేయాలని నర్సుల వినతి
తమను రెగ్యులరైజ్ చేయాలని, 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని గాంధీ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నర్సులు హోంమంత్రి మహ మూద్ అలీని కోరారు. గత 15 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టిచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నర్సులకు హోంమంత్రి హామీ ఇచ్చారు.