జొమాటో, స్విగ్గీలపై దర్యాప్తు అవసరమే

జొమాటో, స్విగ్గీలపై దర్యాప్తు అవసరమే

దర్యాప్తు చేయాలని సీసీఐ ఆదేశాలు

న్యూఢిల్లీ: జొమాటో, స్విగ్గీ కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. పేమెంట్లలో ఆలస్యం, ఎక్కువ కమీషన్​ వసూలు చేయడం సహా పలు ఆరోపణలు ఈ ఫుడ్​ యాగ్రిగేటర్లపై వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సోమవారం నాటి ఆర్డరులో సీసీఐ పేర్కొంది.  దర్యాప్తు చేసి, రెండు నెలల లోపు రిపోర్టు సబ్మిట్​ చేయాల్సిందిగా డైరెక్టర్​జనరల్​ను సీసీఐ ఆదేశించింది. దేశవ్యాప్తంగా 50 వేల మంది మెంబర్లున్న  నేషనల్​ రెస్టారెంట్స్​ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా (ఎన్​ఆర్​ఏఐ) ఫైల్​ చేసిన కంప్లయింట్​పై సీసీఐ పై ఆదేశాలు జారీ చేసింది. కిందటేడాది జులైలో ఎన్​ఆర్​ఏఐ ఈ కంప్లయింట్​ను ఫైల్​ చేసిన విషయం తెలిసిందే. తమ దగ్గర నుంచి చాలా ఎక్కువ కమీషన్​ను జొమాటో, స్విగ్గీలు వసూలు చేస్తున్నాయనేది ఎన్​ఆర్​ఏఐ ప్రధాన ఆరోపణ.