
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియంలోకి 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున మరింత ఎక్కువ మంది వీక్షకుల్ని ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందిని మాత్రమే అనుమతిస్తోంది. కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. దీంతో ఐపీఎల్ మ్యాచుల్లో మరింత మంది ప్రేక్షకులు సందడి చేయనున్నారు.