ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు

గణపురం/ వెంకటాపూర్​ (రామప్ప)/ కాశీబుగ్గ, వెలుగు:  ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా పర్యాటక ప్రాంతాలు ఆదివారం పర్యాటకులు, సందర్శకులతో కిటకిటలాడాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, గణపురం మండలాల్లోని కోటగుళ్లను సివిల్​ సర్వీసెస్​ శిక్షణ అధికారుల బృందం సందర్శించింది. 

అనంతరం ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని ట్రైనీ ఆఫీసర్లు, విదేశీయులు సందర్శించి, ఆలయంలో పూజలు చేశారు. అనంతరం లేక్​లో బోటింగ్​ చేశారు. వరంగల్​ కోటలో విదేశీయులు, స్వదేశీ పర్యాటకులు సందడి చేశారు. ఆయా ప్రాంతాల్లోని కట్టడాల గురించి గైడ్స్​ వివరించగా, అద్భుతమని కొనియాడారు.