పట్టు కోబోయి చిరుత.. పారిపోబోయి కొండముచ్చు…

పట్టు కోబోయి చిరుత.. పారిపోబోయి కొండముచ్చు…

కరెంటు వైర్లు తగిలి రెండూ మృతి :ప్రాణంకోసం కొండముచ్చు… పట్టు కొని ఆకలి తీర్చుకునేందుకు ప్రయత్నం లో చిరుత చెట్టు పైనుంచి దూకాయి. కరెంట్ తీగలపై పడడంతో షాక్‌‌‌‌కొట్టి రెం డూ మృతిచెందాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏకల్‌‌‌‌పూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వడ్సా అటవీ క్షేత్రంలోని ఎకల్‌‌‌‌పూర్ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మామిడి చెట్టు పై ఉన్న కొండముచ్చు ను వేటాడేందుకు చిరుత చెట్టు ఎక్కింది.

ఇది చూసిన కొండముచ్చు చిటారు కొమ్మకువెళ్లింది. చిరుత కూడా పాకుంటూ వెళ్లగా దాని దగ్గరకు చేరడంతో ప్రాణం కాపాడుకునేం దుకు కొండముచ్చు కిందికి దూకింది. దాన్ని ఎలాగైనా పట్టు కోవాలని చిరుత కూడా దూకింది. అయితే ఆ రెండు కూడా చెట్టు సమీపంలో ఉన్న కరెంటు వైర్లకు తగలడంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకొని వాటి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు.