
మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్లిన ఓ స్టూడెంట్అక్కడ తనకు ఆశ్రయమిచ్చి న కుటుంబాన్ని వదిలిరావడానికి ఇప్పుడు ఇష్టపడడంలేదు. అక్కడే ఉంటే ప్రాణాలు పోవచ్చని తెలిసీ రానంటుందా అమ్మాయి. ఇంటి ఓనర్ వాలంటరీగా సైన్యంలో చేరితే.. ముగ్గురు పిల్లలతో ఆయన భార్య ఏమైపోతుందోనని టెన్షన్ పడుతోంది. హర్యానాకు చెందిన ఆ స్టూడెంట్ పేరు నేహ. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీకి సేవలందిస్తూ ఇటీవలే కన్నుమూశారు. మెడిసిన్ ఫైనల్ ఇయర్ పూర్తి చేయడానికి కిందటేడాదే నేహ ఉక్రెయిన్ తిరిగివెళ్లింది. హాస్టల్లో సీటు దొరకకపోవడంతో కీవ్లో ఓ రూమ్ రెంట్కు తీసుకుని ఉంటోంది.ప్రస్తుతం.. ఉక్రెయిన్ సైన్యానికి మద్ధతుగా ఆమె ఉంటున్న ఇంటి ఓనర్ కూడా సైన్యంలో చేరిండు. దీంతో ఆయన భార్యా పిల్లల తో కలిసి నేహ అండర్గ్రౌండ్ బంకర్లో ఉంటోంది. పరిస్థితులు చక్కబడేదాకా, ఆ పిల్లల తండ్రి తిరిగొచ్చేదాక ఇండియా కు రాలేనని తన తల్లికి ఫోన్లోచెప్పింది నేహ. బయట బాంబుల మోత వినిపిస్తు న్నా ఇప్పటికైతే తాము క్షేమంగానే ఉన్నామని చెప్పింది.
మరిన్ని వార్తల కోసం..
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్
మూసీ నీటిని దోసిళ్లతో తాగేలా చేస్తాం
మల్లన్న హుండీల్లో నగదు చోరీకి యత్నం