
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ సైజ్ తగ్గినా … అప్పుల మోత మాత్రం మోగింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఇంచుమించుగా అప్పులు డబులయ్యాయి . ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.03 లక్షల కోట్లకు చేరింది. వీటితోపాటు మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.77,314 కోట్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. వివిధ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత చివరకు ప్రభుత్వంపైనే ఉంటుంది. ఈ అప్పులన్నీ తడిసి మోపెడవుతున్నాయి .
వీటిని సైతం పరిగణనలోకి తీసుకుంటే మొత్తం అప్పు రూ.2.80 లక్షల కోట్లకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోసేందు కు ఇటీవలే ఆర్ఈసీ నుంచి రూ.18,751 కోట్ల అప్పు తీసుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ పేరిట చేసిన ఈ అప్పును ప్రభుత్వం బడ్జెట్ లో చూపించలేదు. ఈ లెక్కన బడ్జెట్ తో పోలిస్తే అప్పులు డబులయ్యాయి. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 25శాతం మించకూడదు. అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అప్పులు జీఎస్డీపీలో21.39 శాతానికి చేరనున్నాయి . తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్నఅప్పు రూ.70 వేల కోట్లు . గడిచి న నాలుగేళ్లలో ఈఅప్పు 4 రెట్లు పెరిగిపోవటం గమనార్హం.
వడ్డీలకే 14 వేల కోట్లు!
2016–17లో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,609 కోట్లవడ్డీలు చెల్లించి నట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపింది.2017–18లో వడ్డీల చెల్లిం పులకు రూ.11,138కోట్లు వెచ్చింది. సవరణ బడ్జెట్లోనూ ఇవే గణాంకా-లున్నాయి . వచ్చే ఏడాది ఈ వడ్డీల భారం రూ.14 వేలకోట్లు దాటనుంది.