ఎడ్యుకేషన్​ యూఎస్​ఏ ఫెయిర్​కు భారీ స్పందన

ఎడ్యుకేషన్​ యూఎస్​ఏ ఫెయిర్​కు భారీ స్పందన

హైదరాబాద్​, వెలుగు: అమెరికాలో చదువుకోవాలనే విద్యార్థుల కోసం హైదరాబాద్​లో శనివారం నిర్వహించిన ఎడ్యుకేషన్​ యూఎస్​ఏ ఫెయిర్​కు భారీ స్పందన వచ్చింది. యునైటెడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్)లోని ఎడ్యుకేషన్‌‌‌‌ యూఎస్​ఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యూఎస్ వర్సిటీల ప్రతినిధులు, ఎడ్యుకేషన్​యూఎస్ఏ సలహాదారులు,  అమెరికా కాన్సులేట్ వీసా అధికారులు ఈ సందర్భంగా స్టూడెంట్లతో మాట్లాడారు. 

ఈవెంట్ కోసం యునైటెడ్ స్టేట్స్‌‌‌‌లో చదువుకోవడానికి ఆసక్తి ఉన్న 3,000 మంది రిజిస్టర్​ చేసుకున్నారు. యూఎస్ కాన్సుల్ జనరల్  కాన్సులర్ చీఫ్  రెబెకా డ్రామ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌లోని 40 గుర్తింపు పొందిన వర్సిటీల, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్​కు వచ్చారు. హైదరాబాద్‌‌‌‌ యూఎస్ కాన్సులేట్ ఆఫీసర్లు వీసా దరఖాస్తులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.