గంటన్నర గేటు తియ్యలే..  ఆగిపోయిన 108

గంటన్నర గేటు తియ్యలే..  ఆగిపోయిన 108

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే గేటును గంటన్నర పాటు క్లోజ్​చేయడంతో అంబులెన్సులో హాస్పిటల్​కు తీసుకెళ్తున్న ఎమర్జెన్సీ పేషెంట్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఓదెల మండల కేంద్రానికి చెందిన రాజేశం అనే యువకుడు గురువారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని తీసుకుని108లో పెద్దపల్లికి బయలుదేరారు. ఆ టైంలో పెద్దపల్లి – కునారం మధ్య ఉన్న రైల్వే గేట్ పడింది. ఎంతసేపు చూసినా ఓపెన్​ చేయలేదు. ఈ క్రమంలో ట్రాఫిక్​ భారీగా పెరిగిపోయింది. పేషెంట్ ను వేరే వెహికల్​లో తరలించే చాన్స్​ లేకుండా పోయింది. యువకుడికి సీరియస్​అవ్వడంతో అంబులెన్స్​ సిబ్బంది ఆక్సిజన్​ పెట్టారు. దాదాపు గంటన్నర తర్వాత గేటు ఓపెన్​ చేయడంతో పేషెంటును పెద్దపల్లి సివిల్ హాస్పిటల్​కు తరలించారు. రైల్వే గేటు కారణంగా నిత్యం ఇలాంటి సమస్యలు తప్పడం లేదని స్థానికులు చెప్పారు.