హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. వెంటనే రిజిస్ర్టేషన్ తో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు స్లాట్ బుక్ చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు.
జులై 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, జులై 1 నుంచి 3 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. జులై 7న సీట్లను అలాట్మెంట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.