- కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా.. ఒమిక్రాన్ను ఎదుర్కోవడానికి రెడీ
- హెల్త్ మినిస్టర్ హరీశ్రావు
గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలో రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్గవర్నమెంట్ హాస్పిటల్ను సడన్గా విజిట్ చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఏఎన్ఎం, పీహెచ్సీల్లో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్లతోనే చాలా వరకు వైరస్ అంతమవుతోందన్నారు. కొవిడ్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైతేనే దవాఖానాల్లో చేరాలన్నారు. కరోనాకు ట్రీట్మెంట్ఇస్తున్న చాలా దవాఖానాల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ కల్పించామన్నారు. అత్యవసరమైతే ఐసీయూలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వైరస్ సోకిన వారు డేంజర్స్టేజీకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువన్నారు. అయినా నిర్లక్ష్యంంగా ఉండవద్దని, కరోనా రూల్స్ పాటించాలన్నారు. వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా , మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ పాల్గొన్నారు.
ఫస్ట్ రోబోటిక్ కన్స్ట్రక్షన్ త్రీడీ ప్రింటర్ ప్రారంభం
దేశంలో మొదటిసారిగా, సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రోబోటిక్ కన్స్ట్రక్షన్త్రీడీ ప్రింటర్ ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అర్బన్ మండల పరిధిలోని రామచంద్ర రావునగర్ లోని చర్విత మెడోస్ లో ఆయన రోబోటిక్ కాంక్రిట్ త్రీడీ ప్రింటర్ ను సింప్లీ ఫోర్జ్ క్రియేషన్ వ్యవస్థాపకుడు అమిత్ గులె, సీఈఓ ధ్రువ్ గాంధీ లతో కలిసి ఓపెన్చేశారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ భవిష్కత్తులో ఈ టెక్నాలజీకి ఎంతో డిమాండ్ ఉంటుందని, మనుషులు చేయలేని పనులను కూడా ఈ మెషీన్లు చేస్తాయన్నారు. చర్విత మెడోస్ ఎండీ, సీఈఓ హరికృష్ణ, పీఓ అజ్మత్ ఖాన్ పాల్గొన్నారు.