ఈ వేస్ట్ సేకరణకు స్పెషల్ ప్రోగ్రాం చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ వేస్ట్ తో పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలకలుషితంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్న కమ్రంలో మెగా ఈ-వేస్ట్ సానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఇండ్లు, ఆఫీసులు, వాణిజ్య సంస్థలనుంచి ఈ వేస్ట్ను సేకరించనున్నారు. పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించనున్నారు.
హైదరాబాద్: సోమవారం( జనవరి 12) నుంచి రెండురోజుల పాటు జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రతి సర్కిల్, డివిజన్ లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఈవేస్ట్ ను నేరుగా ప్రజల దగ్గర నుంచి సేకరిస్తారు. మెయిన్ సర్కిళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూఇటీల్లో గ్రూప్ కలెక్షన్ సిస్టమ్ అమలు చేయనున్నారు. సేకరించిన ఈవేస్ట్ ను ప్రభుత్వం అనుమతి పొందిన రీసైక్లింగ్ ఏజెన్సీలకు తరలించనున్నారు.
ALSO READ : మున్సిపల్ ఎన్నికల్లో కోఆప్షన్ కింద ట్రాన్స్ జెండర్లకు అవకాశం
మరో వైపు ఈవేస్ట్ ను సాధారణ చెత్తతో కలపొద్దని ప్రజలకు జీహెచ్ ఎంసీ అధికారులు విజ్ణప్తి చేస్తున్నారు. ఈ వేస్ట్ తో పర్యావరణ కాలుష్యం, భూగర్బజల కాలుష్యం జరిగి ఆనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.ఈ డ్రైవ్ ద్వారా సురక్షిత రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ALSO READ : ఇసుక అక్రమ దందా చేస్తే ఉపేక్షించేది లేదు..
ఈ ప్రొగ్రాంలో భాగంగా ప్రజలకు శానిటేషన్ సిబ్బంది, ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్స్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించునున్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ వేస్ట్ ను అప్పగించాలని జీహెచ్ ఎంసీ విజ్ణప్తి చేస్తోంది. భవిష్యత్లో కూడా నిరంతర ఈ-వేస్ట్ కలెక్షన్ విధానం అమలు చేసే యోచన లో ఉన్నారు. ఈ-వేస్ట్ సరైన విధంగా నిర్వహిస్తే నగరం మరింత స్వచ్ఛంగా, సురక్షితంగా మారుతుందంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు
