యువత చేతిలో సమాజ భవిష్యత్తు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 యువత చేతిలో సమాజ భవిష్యత్తు:  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: యువతకు క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, కాసీపేట మండలాల్లో ఎంపీ పర్యటించారు. ఈ  సందర్భంగా చెన్నూరు మండలం శివలింగాపూర్​గ్రామంలో సత్వ ప్రకృతి వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం కాసీపేట మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్​టోర్నమెంటు విజేతలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​తో కలిసి ఫ్రైజులు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..  క్రీడల ద్వారా క్రమశిక్షణ,సెల్ప్​డిఫెన్స్​, టీం స్పిరిట్​ పెరుగుతాయన్నారు. కాసీపేట మండల​ప్రీమియం లీగ్ మినీ సీజన్​-1 క్రికెట్​ పోటీల్లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు రూ.40 వేలు క్యాష్​, ట్రోఫీ,రన్నర్​గా నిలిచిన పల్లంగూడ టైటాన్స్​కు రూ.30వేల క్యాష్​, ట్రోపీని ఎంపీ, ఎమ్మెల్యే అందజేశారు. చెన్నూరు పట్టణంలోని మధునపోచమ్మ తల్లి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూజలు చేశారు. అమ్మవారిని దర్మించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త నరేశ్​ సొదరి దీప్తి-శేఖర్​ వివాహ వేడుకలకు ఎంపీ హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం చెన్నూరు మండలం దుగ్నేపల్లి గ్రామంలో కాంగ్రెస్ లీడర్, మాజీ ఎంపీటీసీ చెలిమల బాపురెడ్డి, తండ్రి రాజిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.