- సీతమ్మసాగర్, గౌరవెల్లి పనులు ఆపండి
- ఎన్జీటీ ఆదేశాలు అమలుచేయండి
- సర్కార్కు జీఆర్ఎంబీ విజ్ఞప్తి
- ఇదివరకే పనులు ఆపేశామన్న ఇరిగేషన్ స్పెషల్ సీఎస్
హైదరాబాద్, వెలుగు : సీతమ్మ సాగర్మల్టీపర్పస్ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లలో పర్యావరణ ఉల్లంఘనలపై నేషనల్గ్రీన్ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోదావరి రివర్మేనేజ్మెంట్బోర్డు (జీఆర్ఎంబీ) కోరింది. ఈ రెండు ప్రాజెక్టులపై ఎన్జీటీ ఆదేశాల అమలు కోసం జీఆర్ఎంబీ చైర్మన్ఎంకే సిన్హా అధ్యక్షతన సోమవారం జలసౌధలో ఇరిగేషన్స్పెషల్సీఎస్ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, కరీంనగర్ఈఎన్సీ శంకర్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డితో సమావేశం నిర్వహించారు.
పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రాజెక్టుల వర్క్సైట్లలో పనులు చేస్తున్నారని నిర్దారణ అయ్యిందని, గ్రీన్ట్రిబ్యునల్ఆదేశాలను గౌరవిస్తూ ఆయా పనులను వెంటనే ఆపేయాలని కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వర్క్సైట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే, ఎన్జీటీ ఆదేశించిన వెంటనే తాము రెండు ప్రాజెక్టుల పనులను నిలిపివేశామని రజత్కుమార్తెలిపారు. ఎన్జీటీ తీర్పు అమలు కోసం గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
కేఆర్ఎంబీ మీటింగ్వాయిదా
కేఆర్ఎంబీ త్రీ మెంబర్కమిటీ సమావేశం వాయిదా వేశారు. ఏపీ, తెలంగాణకు కామన్రిజర్వాయర్లుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల కోరుతూ రెండు రాష్ట్రాలు సమర్పించిన ఇండెంట్లపై చర్చించేందుకు బోర్డు మెంబర్సెక్రటరీ డీఎం రాయ్పురే అధ్యక్షతన సోమవారం త్రీ మెంబర్కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, తాము ఈనెల 21 వరకు మీటింగ్కు రాలేమని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఏపీ ఈఎన్సీ రాకపోవడంతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్సైతం మీటింగ్కు దూరంగా ఉండిపోయారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు.
తాగు, సాగు నీటి అవసరాల కోసం 38.73 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ఇండెంట్సమర్పించగా, తమకు 30.09 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో తాగునీటి అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు నీటి విడుదలకు అనుమతించలేమని బోర్డు అధికారులు చెప్తున్నారు. మళ్లీ త్రీ మెంబర్కమిటీ సమావేశం జరిగే వరకు ఏపీ రెండు రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకోకుండా బోర్డు కట్టడి చేయాలని తెలంగాణ కోరుతోంది.