అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది

అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు వ్యతిరేకంగా నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంబజార్ లోని ఉస్మాన్ గంజ్ నాలా పరిసర ప్రాంతాలలో ఇష్టానుసారంగా అక్రమకట్టడాలు కట్టారని …. వాటిని తక్షణమే కూల్చివేయాలనే సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

సోమవారం నూతనంగా నాలాపై నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి తలసాని.. గత ప్రభుత్వాల నిర్లక్షం కారణంగానే వర్షాలు పడితే నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలుస్తుందన్నారు. ఉస్మానియా హాస్పిటల్ ఓ వార్డులో కూడా నీరు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని… ఈ వ్యవహారంలో ఎవరు ఉన్న కూడా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అనంతరం అబిడ్స్, నేతాజీ నగర్ కాలనీలో 12 లక్షల విలువతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు.