హైదరాబాద్, వెలుగు : రోహింగ్యాలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. కింది కోర్టు గతంలో బెయిల్ ఇచ్చినా రెహముల్లా, జాఫర్ ఆలమ్ అలియాస్ మహమద్ సాజిద్, అబ్దుల్ అజీజ్, నూర్ ఖాసీం అలియాస్ మహ్మద్ నూర్, నాజర్ ఉల్ ఇస్లామ్లను ప్రభుత్వం చర్లపల్లి జైల్లోనే ఉంచింది.
ఈ చర్యను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన మహ్మద్ తాహీర్, ఇతరులు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లను జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ వేణుగోపాల్ డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. విదేశీయులను, శరణార్థులను అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. విదేశీ పౌరుల చట్టం 3(2) జీ ప్రకారం ఆ అధికారం కేంద్రానికి ఉందని వెల్లడించింది.