కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వండి

కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వండి

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. సమ్మక్క జాతర ఏర్పాట్లు, వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని ఆదేశించింది. దీనిపై ఆన్ లైన్ విచారణకు హాజరైన డీహెచ్ శ్రీనివాస్ రావు..రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే  పూర్తి చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని కోర్టుకు విన్నవించారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు..పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ చెప్పారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తల కోసం
కార్వీ కేసు విచారణ వేగవంతం

ప్రాపర్టీ ట్యాక్స్​ చెక్కులు  బౌన్స్​ అయితున్నయ్