అనుమానంతో భార్యను..అడ్డొచ్చాడని మామను నరికి చంపిండు

అనుమానంతో భార్యను..అడ్డొచ్చాడని మామను నరికి చంపిండు

హైదరాబాద్, వెలుగుఅనుమానంతో భార్యను, అడ్డొచ్చాడని మామను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్​ జిల్లా దౌల్తాబాద్ ​మండలం బాలంపేటలో జరిగింది. బాలంపేటకు చెందిన గఫూర్ సాబ్ బిడ్డ హాజీ బేగానికి హైదరాబాద్​లోని యాకుత్​పురాకు చెందిన సయ్యద్ ఖలీమ్​తో 15 ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఖలీమ్ యాకుత్​పురాలోని ఓ సైకిల్ దుకాణంలో పని​చేస్తున్నాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ఖలీమ్.. ప్రతిరోజు ఆమెతో గొడవ పడుతుండేవాడు. విసుగు చెందిన హాజీ బేగం పిల్లలను తీసుకొని 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఖలీమ్ బాలంపేటకు వెళ్లొస్తుండేవాడు. రెండ్రోజుల క్రితం వచ్చి భార్యను పంపించాలని మామను అడిగాడు. అందుకు గఫూర్​సాబ్, హాజీ బేగం ఒప్పుకోలేదు. కోపం పెంచుకున్న ఖలీమ్ ​మంగళవారం ఉదయం 6 గంటలకు నిద్రపోతున్న భార్యను కత్తితో నరికి చంపేశాడు. ఆమె కేకలు విని అడ్డుకునేందుకు వచ్చిన గఫూర్​పై దాడి చేయగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. వదిలేస్తే ప్రాబ్లమ్​ అవుతుందని వెంటపడి మామను కూడా నరికి చంపేశాడు. పోలీసులు స్పాట్ కు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కొడంగల్ సీఐ నాగేశ్వర్​రావు తెలిపారు.

ఒప్పందం తర్వాతే ఏపీకి బస్సులు