కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంక్లో పడి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. కాకినాడ జిల్లాలోని జి.రంగంపేట్లో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఉన్న ట్యాంక్ను క్లీన్ చేసేందుకు ఏడుగురు కార్మికులు అందులోకి దిగారు. ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ కూలీ అందులో జారి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మిగతా ఆరుగురు కార్మికులు ట్యాంక్లోకి దిగగా, చిక్కుకుపోయారు. దీంతో ట్యాంక్లో ఊపిరాడక మృతిచెందారు. ఇందులో ఐదుగురు కూలీలు పాడేరుకు, మిగతా ఇద్దరు పెద్దపురానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫ్యాక్టరీకి సీలు వేశామని, కేసు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని వెల్లడించారు.
ఆయిల్ ట్యాంక్లో పడి ఏడుగురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- February 10, 2023
లేటెస్ట్
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్