బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్ర సంచలన ప్రకటన చేశారు. తాము విడిపోయాం..ఈ కష్టం సమయం నుంచి బయటపడాటానికి కొంచెం టైం కావాలంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంతేగాకుండా హార్ట్ బ్రొకెన్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సడెన్ గా రాజ్ కుంద్రా చేసిన ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా? ఏంటా అని చర్చిస్తున్నారు.
రాజ్ కుంద్రా,శిల్పాశెట్టి నుంచి విడాకులు తీసుకుంటున్నారా? లేక వేరే ఏదైనా ఉందా సందేహం వస్తుంది. ఎందుకంటే రాజ్ కుంద్రా ట్విట్టర్లో ఎక్కడా తన భార్య శిల్పాశెట్టి పేరు ప్రస్తావించలేదు. అయితే కొందరు రాజ్ కుంద్రా విడాకులు గురించి కాదనుకుంటున్నారు.
ఇటీవల రాజ్ కుంద్రా బ్లూ ఫిలీమ్స్ కేసులో జైలుకెళ్లి బెయిల్ పై వచ్చాడు. అయితే అప్పటి నుంచి తన ఫేస్ ను ఎవరికీ చూపెట్టడం లేదు. బయటకు ఎక్కడికెళ్లినా ఏదో ఒక మాస్క్ పెట్టుకుని బయటకు వస్తున్నాడు. రాజ్ కుంద్రా యూటీ 69 అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తన జీవితంలోని కాంట్రవర్శీల ఆధారంగా తీస్తున్న ఈ మూవీ నవంబర్ 3న రిలీజ్ అవుతోంది. అయితే ప్రమోషన్లో భాగంగా రాజ్ కుంద్రా మీడియా ముందు మాస్క్ తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా భార్యతో విడాకులు కాదని.. మాస్క్ నుంచి దూరంగా ఉంటున్నాడేమో అందుకే ట్వీట్ చేశారంటూ అభిప్రాయపడుతున్నారు. నిజంగా రాజ్ కుంద్రా తన భార్య శిల్పాశెట్టి నుంచి విడిపోయాడా? లేక మాస్క్ నుంచా అనేది తెలియాల్సి ఉంది. శిల్పాశెట్టితో రాజ్ కుంద్రాకు 2009లో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.
We have separated and kindly request you to give us time during this difficult period ??
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023