ప్రభుత్వంతో చర్చలు సఫలం.. వెనక్కి తగ్గిన జూడాలు

ప్రభుత్వంతో చర్చలు సఫలం.. వెనక్కి తగ్గిన జూడాలు

ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో  తెలంగాణ జూనియర్ డాక్టర్లు  వెనక్కి తగ్గారు. జూన్ 30 నుంచి చేయనున్న సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు  ప్రకటించారు.  రాష్ట్ర జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇవాళ జూన్ 29న  ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. చర్చలకు ముందే  మెడికోల స్టైఫండ్స్ 15 శాతం పెంచినందుకు గానూ మంత్రికి కృతజ్ఞతలు తెలియ చేశారు. అన్ని వైద్యకళాశాల్లో సదుపాయాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన జూడాలు తెలిపారు. ఈ క్రమంలోనే సమ్మె చేయట్లేదని చెప్పారు. 

మెడికోలకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో మెడికో,డెంటల్ స్టూడెంట్స్ కు గౌరవ వేతనం పెరగనుంది.  సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా 15 శాతం పెంపుతో  ఇంటర్న్ లకు నెలకు రూ. 29,792 వేలు అందనుంది. ఇక  పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్  రూ. 67,032 స్టైఫండ్ అందనుంది. సెకండియర్ లో రూ. 70,757,  ఫైనల్ ఇయర్ స్టైఫండ్ రూ. 74,782 గౌరవ వేతనం  అందనుంది.  ఇక  సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్  రూ. లక్షా 6,461 స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్స్ కు  కూడా రూ. లక్షా 6,461 లభించనుంది.