ఆ భూమిని గురుద్వారాకే వదిలేయాలి: ఢిల్లీ వక్ఫ్ బోర్డు పిటిషన్ కొట్టేసిన సుప్రీం

ఆ భూమిని గురుద్వారాకే వదిలేయాలి: ఢిల్లీ వక్ఫ్ బోర్డు పిటిషన్ కొట్టేసిన సుప్రీం


న్యూఢిల్లీ:  ఢిల్లీలోని షాదర ప్రాంతంలో గురుద్వారా కొనసాగుతున్న భూమి  తమదని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. దశాబ్దాలుగా ఆ భూమిలో  గురుద్వారా కొనసాగుతున్నందున వక్ఫ్ బోర్డు ఆ భూమిని వదులుకోవాలని పేర్కొంది. వక్ఫ్ బోర్డు తరఫున సీనియర్ అడ్వకేట్ సంజయ్ ఘోష్​ వాదిస్తూ.. గురుద్వారా స్థాపనకు ముందు ఆ ప్రాంతంలో మసీదు ఉండేదని,  దానిని మసీదు​ తకియా బబ్బర్ షా అని పిలిచేవారన్నారు. 

అది వక్ఫ్ అధీనంలో ఉండడం వల్లే మసీదు ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ వాదనను జడ్జి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తోసిపుచ్చారు. 1953లో అప్పటి భూ యజమాని మొహమ్మద్ అహ్సాన్ దానిని విక్రయించాడని, అప్పుడే అది వక్ఫ్‌‌‌‌ అధీనంలోంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. 

ఆ స్థలంలో దేశ విభజన నాటి నుంచి గురుద్వారా కొనసాగుతున్నదని, పూర్తిస్థాయిలో పనిచేస్తున్న దాన్ని తొలగించి, వక్ఫ్​ బోర్డుకు ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. దాన్ని అలాగే కొనసాగించడమే న్యాయమని తీర్పు చెప్పారు.