హనుమంతుని డైలాగ్ మార్చిన ఆదిపురుష్ మేకర్స్..

హనుమంతుని డైలాగ్ మార్చిన ఆదిపురుష్ మేకర్స్..

డైరెక్టర్ ఓంరౌత్(OmRout) తీసిన ఆదిపురుష్(Adipurush) మూవీ రామాయణాన్నిపూర్తిగా అపహాస్యం చేశారని, డైలాగ్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసేందే. ముఖ్యంగా ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ శుక్లా(Manoj muntashir shukla) హనుమంతుడు పై రాసిన మాస్ డైలాగ్స్ మార్చాలంటూ దేశవ్యాప్తంగా విమర్శలు రాగా..దీంతో డైలాగ్ రైటర్ వివరణ ఇచ్చిన్నప్పటికీ కూడా విమర్శలు ఆగలేదు.

తాజాగా కొత్త డైలాగ్ ను యాడ్ చేసినట్టు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాలో హనుమంతుడు చెప్పే మాస్  డైలాగ్ లో నీ బాబుది అనే పదాన్ని తొలగించి లంక అనే పదాన్ని జత చేసింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు అసలు డైలాగ్ కాకుండా.. కేవలం పదాన్ని మాత్రం లంక పేరుతో మార్చడం చర్చనీయాంశం అయింది. అయితే, కేవలం పదాన్ని మాత్రం మారిస్తే సరిపోదుగా..అని నెటిజన్లు సోషల్ మీడియా లో రెట్టింపు కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ: శ్రియారెడ్డి : సలార్ కోసం ఊహకందని విజువల్స్.. అదొక అద్భుతం

 ఆదిపురుష్ మూవీ లో హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ నటుడు దేవదత్తా నాగే నటించారు. ఈ సినిమా రీలిజ్ అయినా ఐదు రోజుల్లో రూ.370 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టిన్నట్లు సమాచారం. విమర్శలు రాకపోయి ఉంటే రికార్డ్ కలెక్షన్స్ వచ్చేవంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదిపురుష్ రిలీజ్ అయినా వారాంతరలోనే  70 శాతం వసూళ్లు పడిపోవడంతో బ్రేక్ ఈవెన్ చేరడం కష్టమని ట్రేడ్ వర్గాల సమాచారం.