పగిలిన మిషన్ భగీరథ పైపులైన్.. కోతకు గురైన NH 161 రోడ్డు 

పగిలిన మిషన్ భగీరథ పైపులైన్.. కోతకు గురైన NH 161 రోడ్డు 

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వేర్ గ్రామ శివారులో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో రోడ్లపై నీరు వృథాగా పోతోంది. భారీగా రోడ్లపై నీరు రావడంతో NH 161 రోడ్డు కోతకు గురైంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరడంతో పొలాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి.

మరోవైపు..దగ్గరలోనే ఉన్న పాఠశాలలోకి కూడా నీరు చేరింది. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బాన్సువాడకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.