అత్తా కోడళ్ల మధ్య గొడవ.. చిన్నారి బలి

అత్తా కోడళ్ల మధ్య గొడవ.. చిన్నారి బలి

మహబూబ్ నగర్, వెలుగు: అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవకు చిన్నారి బలైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గండీడ్‌ మండలంలోని జక్లపల్లికి చెందిన ఓ మహిళ ఫ్యామిలీ విషయంలో శుక్రవారం తన అత్తతో గొడవ పెట్టుకున్నది. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో 9 నెలల తన కూతురును కింద పడేసింది. ఆ చిన్నారి స్పృహ కోల్పోవడంతో వెంటనే కోస్గిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లా రు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని చెప్పారు. కాగా, చిన్నారి తల్లి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.