పెళ్లైన వారానికే కొత్త జంట ఆత్మహత్యయత్నం

పెళ్లైన వారానికే కొత్త జంట ఆత్మహత్యయత్నం

నిజామాబాద్‌ జిల్లా: పెళ్లి చేసుకుని పది రోజులు కూడా గడవకముందే ఓ కొత్త జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరుగగా ఇరు కుటుంబాల్లో కలకలం రేపింది. వేల్పూరు మండలం, పచ్చల నడుకుడ గ్రామంలోని నవ దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా మారటంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ట్రీట్ మెంట్ ఇస్తున్నామని డాక్టర్లు తెలిపారు. వీరికి జూన్- 13న వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే వారు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.