టీ20ల్లో కోహ్లీ, రోహిత్‌కు నో ప్లేస్‌! - ఐదు సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్న కొత్త సెలెక్షన్‌ కమిటీ

టీ20ల్లో కోహ్లీ, రోహిత్‌కు నో ప్లేస్‌! - ఐదు సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్న కొత్త సెలెక్షన్‌ కమిటీ

నేడో, రేపో న్యూజిలాండ్‌ సిరీస్‌కు టీమ్‌ ఎంపిక

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌తో వన్డే, టీ20 సిరీస్‌‌కు నేడో, రేపో టీమిండియాను ప్రకటించనున్నారు. ఈ మేరకు చేతన్‌‌ శర్మ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్‌‌ కమిటీ కసరత్తు మొదలుపెట్టింది. అయితే కొత్త ఏడాదిలో కొత్త కమిటీ పలు సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టెస్ట్‌‌, వన్డేలకు, టీ20లకు సపరేట్‌‌గా టీమ్స్‌‌ను రెడీ చేయాలని కమిటీ భావిస్తోంది. అదే జరిగితే కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, మాజీ కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీకి షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ప్లేస్‌‌ ఉండదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో చీఫ్‌‌ సెలెక్టర్‌‌గా పలు నిర్ణయాలు తీసుకున్న చేతన్‌‌ మళ్లీ పదవిలోకి రావడంతో సీనియర్లకు టీమ్‌‌లో చోటు గండం వెంటాడుతోంది. ప్రస్తుతమైతే న్యూజిలాండ్‌‌తో.. టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అయితే వన్డే వరల్డ్‌‌కప్‌‌ దృష్ట్యా రోహిత్‌‌, కోహ్లీని 50 ఓవర్ల ఫార్మాట్‌‌లోకి తీసుకున్నా.. టీ20ల్లో మాత్రం ఈ ఇద్దరికీ చోటు కష్టమేనని తెలుస్తోంది. వీళ్లతో పాటు పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ, స్పిన్నర్‌‌  అశ్విన్‌‌ను కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్‌‌ లేదు. అయితే  కేఎల్‌‌ రాహుల్‌‌ను కూడా షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో కొనసాగించాలా? వద్దా? అన్న సందిగ్ధత కొనసాగుతున్నది. వన్డేలకు ఎలాగైతే కోర్‌‌ గ్రూప్‌‌ను మెయింటేన్‌‌ చేస్తున్నారో.. టీ20లకు కూడా ప్రత్యేకమైన టీమ్‌‌ను రూపొందించాలని చూస్తున్నారు. అయితే ఇతర ప్లేయర్ల పెర్ఫామెన్స్‌‌ను బట్టి టీమ్‌‌లోకి తీసుకోవడం, తొలగించడం వంటివి చేయనున్నారు. ‘ప్రతి టీమ్‌‌కు షార్ట్‌‌, లాంగ్‌‌ టర్మ్‌‌ ప్లాన్స్‌‌ ఉంటాయి. ఇప్పుడు వన్డే వరల్డ్‌‌ కప్‌‌ షార్ట్‌‌ టర్న్‌‌ ప్లాన్‌‌. టీ20 వరల్డ్‌‌కప్‌‌ లాంగ్‌‌ టర్మ్‌‌ ప్లాన్‌‌. ఇప్పుడైతే మా ప్లాన్స్‌‌ మొదలయ్యాయి. ఈ ఏడాది చాలా తక్కువ టీ20లు ఉన్నాయి. అందుకే మేం ఎక్కువగా వన్డే వరల్డ్‌‌కప్‌‌పై ఫోకస్‌‌ పెట్టాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఓవరాల్​గా కొత్త కమిటీ ఐదు అంశాలపై సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. అవేంటో చూద్దాం..

టీ20 కెప్టెన్‌‌గా పాండ్యా: గత చరిత్ర ఏమాత్రం లేకుండా కొత్త కుర్రాళ్లతో టీ20 టీమ్‌‌ను ఎంపిక చేసి హార్దిక్‌‌ పాండ్యాను పర్మినెంట్‌‌ కెప్టెన్‌‌గా చేయాలి. సూర్యకుమార్‌‌ను వైస్‌‌ కెప్టెన్‌‌గా ప్రకటించాలి. ప్రస్తుతానికి ఇది లాంఛనమే అనిపిస్తోంది. అదే జరిగితే ఇంగ్లండ్‌‌ తరహాలో ఇండియా కూడా అధికారికంగా స్ప్లిట్‌‌ కెప్టెన్సీని అమలు చేయాలి. రోహిత్‌‌.. టెస్ట్‌‌, వన్డేలకు మాత్రమే కెప్టెన్‌‌గా ఉంటాడు. 

సీనియర్లకు గుడ్‌‌బై: శ్రీలంకతో టీ20లకు కంప్లీట్‌‌గా యంగ్‌‌స్టర్స్‌‌ను తీసుకొచ్చిన పాత సెలెక్షన్‌‌ కమిటీ విధానాన్ని కొత్త కమిటీ కూడా కొనసాగించాలి. అంటే రోహిత్‌‌, కోహ్లీ, అశ్విన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, మహ్మద్‌‌ షమీ, భువనేశ్వర్‌‌లకు టీ20ల్లో నో ప్లేస్‌‌. దీనిని కొత్త కమిటీ అధికారికంగా ప్రకటిస్తుందా? చూడాలి. 

2024 వరల్డ్‌‌కప్‌‌ కోసం ప్లేయర్ల షార్ట్‌‌ లిస్ట్‌‌: 

2022 టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఇండియా వైఫల్యం తర్వాత టీమ్‌‌లో భారీ మార్పులు ఉంటాయని సంకేతాలిచ్చారు. ఆ దిశగా 25 మందితో 2024 టీ20 వరల్డ్‌‌కప్‌‌కు షార్ట్‌‌ లిస్ట్‌‌ను ప్రకటించాలి. 

రోహిత్‌‌ వారసుడు ఎవరు? 

ఈ ఏడాది వన్డే వరల్డ్‌‌కప్‌‌ వరకు రోహిత్‌‌.. టెస్ట్‌‌, వన్డేలకు కెప్టెన్‌‌గా ఉన్నాడు. ప్రస్తుతం అతని వయసు 35 ఏళ్లు. ఆ తర్వాత ఆడే చాన్సెస్‌‌ తగ్గుతాయి కాబట్టి అతని వారసుడు ఎవరు? టెస్ట్‌‌లకు రాహుల్‌‌ను, వన్డేలకు హార్దిక్‌‌ను ఎంపిక చేస్తారా? మధ్యలో రిషబ్‌‌ పంత్‌‌ కూడా రేస్‌‌లో ఉన్నాడు. 

ద్రవిడ్‌‌ ఫ్యూచర్‌‌ ఏంటీ? 

చీఫ్‌‌ కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ పదవీకాలం వన్డే వరల్డ్‌‌కప్‌‌తో ముగుస్తుంది. తర్వాత అతన్ని కొనసాగిస్తారా? ప్రస్తుతమైతే రాహుల్‌‌ కోచింగ్‌‌పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అతన్ని తప్పించి వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ను తీసుకొస్తారా? ద్రవిడ్‌‌ తర్వాత ప్లాన్స్‌‌ ఏమిటనే దానిపై సెలెక్టర్లు ఎంతో కొంత కసరత్తు చేయాల్సి ఉంది. 

టీ20లకు కుర్రాళ్లే...

షార్ట్‌‌ ఫార్మాట్‌‌ వరల్డ్‌‌కప్‌‌కు ఇంకా రెండేళ్ల టైమ్‌‌ ఉంది. కాబట్టి ఇప్పట్నించే కొత్త టీమ్‌‌ను రెడీ చేయనున్నారు. అయితే ఇందులో సీనియర్లకు నో ప్లేస్‌‌. ఓన్లీ కుర్రాళ్లకు మాత్రమే చాన్స్‌‌. హార్దిక్‌‌ పాండ్యా కెప్టెన్సీలో కంప్లీట్‌‌గా కొత్త టీమ్‌‌ను రూపొందించాలని కమిటీ భావిస్తోంది. శ్రీలంకతో ఆడిన టీమ్‌‌లో ప్లేయర్ల యావరేజ్‌‌ వయసు 27 ఏళ్లు. అందులో ఎక్కువ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ పాండ్యా (84 టీ20లు)కు మాత్రమే ఉన్నది. కాబట్టి రాబోయే రెండేళ్లు ఇదే ప్లాన్‌‌ను అమలు చేయనున్నారు.