దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కి చేరింది. ఇప్పటి వరకు 4,41,43,179 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కొవిడ్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,695కి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.01శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.