జియోకి 7.2 లక్షల కొత్త కస్టమర్లు

జియోకి 7.2 లక్షల కొత్త కస్టమర్లు

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్​ సబ్​స్క్రయిబర్ల సంఖ్య సెప్టెంబర్​ నెలలో 36 లక్షల మేర తగ్గిపోయింది. వోడాఫోన్​ ఐడియా (వీ) సెప్టెంబర్​ నెలలోనూ కస్టమర్లను పోగొట్టుకుంది.  రిలయన్స్​ జియో, ఎయిర్​టెల్​లు మాత్రం తమ కస్టమర్లను పెంచుకున్నాయి.  ఈ నెలలో జియోకి కొత్తగా 7.2 లక్షల మంది కస్టమర్లు రాగా, భారతి ఎయిర్​టెల్​కు 4.12 లక్షల మంది కొత్త కస్టమర్లు దొరికారు. సెప్టెంబర్​ నెలలో వోడాఫోన్​ ఐడియా తన సబ్​స్క్రయిబర్లలో 40 లక్షల మందిని పోగొట్టుకుంది. దీంతో ఆ కంపెనీ కస్టమర్ల సంఖ్య 24.91 కోట్లకు తగ్గిపోయినట్లు ట్రాయ్​  వెల్లడించింది. ఆగస్టు నెలలో 114.9 కోట్ల మంది వైర్​లెస్​ సబ్​స్క్రయిబర్లుండగా, సెప్టెంబర్​ నాటికి  ఈ సంఖ్య 114.5 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంటే 0.32 శాతం తగ్గింది.