హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి వేదికపైనా కాంగ్రెస్పై కేటీఆర్విమర్శనాస్త్రాలను సంధించారు. ఓ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాటనూ తన క్యాంపెయిన్లో వాడుకున్నారు. కుర్చీ మడతపెట్టి కొడితే కాంగ్రెస్ ఖతమవ్వాలంటూ జూబ్లీహిల్స్ఓటర్లకు పిలుపునిచ్చారు. కానీ, అది బూమరాంగ్అయ్యింది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్ గిఫ్ట్కింద.. బీఆర్ఎస్నే కుర్చీ మడతెట్టి కొట్టారని పొలిటికల్సర్కిల్స్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుస రోడ్షోలు చేసినా.. జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ ఎన్నికలోనూ గెలవలే..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేటీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లింది. కానీ, 17 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతయ్యాయి. 2019 జనరల్ ఎలక్షన్లలో 9 సీట్లు గెలిచిన ఆ పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకున్నది. ఈ విషయంలో నాయకుడిగా ఫెయిల్ అయ్యారన్న అపవాదునూ కేటీఆర్ ఎదుర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని సీట్లను బీఆర్ఎస్ ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నది. 17 సీట్లను సొంతం చేసుకున్నది. అయితే, 2024 మే 13న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్పై విజయం సాధించింది.
