గ్రేటర్’లో ఎక్స్ అఫీషియో ఓట్లెందుకు?

గ్రేటర్’లో ఎక్స్ అఫీషియో ఓట్లెందుకు?

    హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిల్ 

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్‌‌‌‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌‌‌‌ ఎన్నికల్లో ఎక్స్‌‌‌‌ అఫీషియో ఓటర్లుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌‌‌‌) దాఖలైంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇ. అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ ఈ పిల్‌‌‌‌ ను దాఖలు చేశారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో 150 వార్డు డివిజన్లు ఉంటే 55 మంది ఎక్స్‌‌‌‌ అఫీషియో మెంబర్స్‌‌‌‌ ఓటింగ్‌‌‌‌లో పాల్గొనేందుకు అనుమతి ఉందని, ఇది మెజార్టీ సభ్యుల పాలన జరగాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చేలా ఉందని ఆయన తెలిపారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో చట్టసభ సభ్యులు ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుమతి ఇచ్చే జీహెచ్‌‌‌‌ఎంసీ యాక్ట్‌‌‌‌ 1955లోని సెక్షన్‌‌‌‌ 90(1)ను చట్ట వ్యతిరేకమని ప్రకటించి, దానిని కొట్టేయాలని కోరారు. పిల్ లో చీఫ్‌‌‌‌ సెక్రటరీ, మున్సిపల్, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శులు, స్టేట్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌ కమిషన్, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.