చీకట్లోనూ ఉపాధ్యాయుల నిరసన.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్

చీకట్లోనూ ఉపాధ్యాయుల నిరసన.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ : 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. దీంతో గోషామహల్ గ్రౌండ్స్ లోనే ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.

317 జీవో కారణంగా తాము స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని.. సొంత జిల్లాల్లో తమకు పోస్టింగులు ఇవ్వాలని కోరారు.