చార్మినార్ దగ్గర ముగిసిన గణేష్ శోభాయాత్ర

చార్మినార్ దగ్గర ముగిసిన గణేష్ శోభాయాత్ర

గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలివెళ్తున్నాయి. గణేష్ నిమజ్జన శోభాయాత్ర చార్మినార్ దాటడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ప్రశాంతంగా పాతబస్తీలో శోభాయాత్ర పూర్తైంది. చార్మినార్ దాటి హుస్సేన్ సాగర తీరం వైపు గణనాథులు వెళ్తున్నాయి. 

చార్మినార్ దాటి మదినా వద్దకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర చేరుకుంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దాదాపు 1000కి పైగా వినాయక విగ్రహాలు బాలాపూర్, అలియాబాద్, చాంద్రాయణగుట్ట,ఫలక్ నుమా, లాల్ దర్వాజా, శాలిబండ, మొగల్పురా ప్రాంతాల నుండి చార్మినార్ దాటాయి.

మరోవైపు.. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా కనిపిస్తున్నాయి. గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తుండడంతో యువత డీజే సాంగ్స్ తో దుమ్ములేపుతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ హుషారుగా ఆడి పాడుతున్నారు.