ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ వేదికగా నేటినుంచి ప్రారంభమయింది. మొదటి మ్యాచ్లో రఫెల్ నాదల్ డెబ్యూటెంట్ జాక్ డ్రాపర్పై విజయం సాధించి రెండవ రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇదివరకు ఛాంపియన్షిప్లో ఆడిన అనుభవం లేకున్నా.. డ్రాపర్ స్వేచ్ఛగా ఆడాడు. దిగ్గజ ఆటగాడితో ఆడుతున్నా అనే బెరుకులేకుండా నాదల్కి గట్టి పోటీ ఇచ్చాడు. మొదటిది, మూడో సెట్స్లో గెలిచినంత పనిచేశాడు. 7-5, 2-6, 6-4, 6-1 స్కోర్తో నాదల్ విజయం సాధిచాడు. అయితే, ఈ సీజన్ నాదల్కి పంతొమ్మిదవది కావడం విశేషం.
టోర్నీ ప్రారంభానికి ముందు పునరాగమనం చేస్తున్న జొకోవిచ్ పైనే అందరి దృష్టి ఉంది. ఈ సారి సానియా మీర్జా సింగిల్స్ తరుపున బరిలోకి దిగుతోంది. భారత్ తరపున లియాండర్ పేస్.. లూహీతో, మహేష్ భూపతి.. మాక్స్ మిర్నీతో, సోమదేవ్.. ప్రకాష్ అమృతరాజ్తో, బోపన్న.. ఖురేషితో డబుల్స్ విభాగంలో బరిలోకి దిగుతున్నారు.