ఏప్రిల్ 28న మ‌హేష్ 28వ చిత్రం రిలీజ్

ఏప్రిల్ 28న మ‌హేష్ 28వ చిత్రం రిలీజ్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో SSMB28గా ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మ‌హేష్ సరసన ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

ఇదిలావుండగా ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా వార్త ఒకటి అభిమానులలో ఆనందోత్సాహాలు కలిగించింది. అదే సినిమా విడుదల తేదీ. ఈ మూవీ 28 ఏప్రిల్, 2023 వేసవిలో విడుదల కానుందంటూ.. ఈ చిత్రానికి సంబంధించి ఒ వీడియోను ఇవాళ విడుదల చేశారు మేకర్స్. మ‌హేష్ కు ఇది 28వ చిత్రం కావడం, విడుదల తేదీ కూడా 28వ తేదీ కావడంతో ఈ వార్త విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తుండగా.. కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడిగా పి.ఎస్.వినోద్ పని చేస్తున్నారు. కాగా, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియపరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.