
- ఆ జోన్లోనే ..ఎందుకు..?
త్రిష ప్రధానపాత్రలో తెరకెక్కిన సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది రోడ్’. రివేంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది క్యాప్షన్. అరుణ్ వాసిగరన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ‘రోడ్డు వైపుకు చూస్తూ.. ఏం జరిగింది.. ఎందుకు జరిగింది’ అనే త్రిష డైలాగ్స్తో ట్రైలర్ మొదలైంది. ఆ రోడ్డుపై వరుస యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎన్ హెచ్ 44లో ప్రత్యేకంగా ఆ జోన్లోనే యాక్సిడెంట్స్ తరచుగా ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై ఆమె రీసెర్చ్ చేస్తోంది.
Also Read :- IND vs AUS: శభాష్ అనిపించుకున్న రాహుల్.. 27 ఏళ్ల చరిత్రలో తొలి విజయం
మెక్సికన్ డ్రగ్ మాఫియా ఇలా చేస్తుందని, కానీ మధురైలో ఇలా జరగడం షాక్గా ఉందని మరొకరు చెబుతారు. ఆ మిస్టరీని త్రిష ఎలా సాల్వ్ చేసింది.. అసలు ఆ పోరాటం ఎందుకామె చేస్తోంది అనేది మిగతా కథ. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మియా జార్జ్, ఎంఎస్ భాస్కర్, వివేక్ ప్రసన్న, వేల్ రామమూర్తి, లక్ష్మీ ప్రియ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది.